Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 19వ తేదీ వరకు ఎంసెట్ రాత పరీక్షలు

Webdunia
సోమవారం, 15 మే 2023 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు మొదటి దశ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ ఆచార్య రంగ జనార్థన్ వెల్లడించారు. 
 
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందుకోసం ఉదయం 7.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని వెల్లడించారు. 
 
ఏపీలో 129, తెలంగాణాలో 7 చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 3.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు గుర్తింపు కోసం ఏదేనా గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments