Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా బ్యాంకును విలీనం చేస్తే.. ఆ పని చేయండి.. ఎంపీ బాలశౌరి

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (14:31 IST)
తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఆంధ్రా బ్యాంకును- యూనియన్ బ్యాంకులో విలీనంపై ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బౌలశౌరి లేఖ రాశారు.
 
స్వాతంత్ర్యం రాక మునుపు నుండి 90 ఏళ్ల కిందటే ఏపి కి చెందిన పట్టాభిరామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకులతో కలపొద్దని విన్నపం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించుకోవాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో విలీనం చేయాల్సి వస్తే విలీనమైన బ్యాంకుకు *ఆంధ్రా బ్యాంకుగానే నామకరణం చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రాబ్యాంకుగా మార్చి దాని హెడ్ క్వార్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీను ఎంపీ బాలశౌరి కలవనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments