Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోచుకోవాలన్న యావేగానీ పూర్తి చేయాలన్న ధ్యాస లేదు : విజయసాయిరెడ్డి

దోచుకోవాలన్న యావేగానీ పూర్తి చేయాలన్న ధ్యాస లేదు : విజయసాయిరెడ్డి
, శనివారం, 22 జూన్ 2019 (13:52 IST)
ప్రజా ధనాన్ని దోచుకోవాలన్న యావే గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేకుండా పోయిందని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విమర్శల వర్షం కురిపించారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత కూడా పూర్తి చేయలేక పోయారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 
 
పైగా, అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవాలన్న యావేగానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్నారు. కేంద్రం కావాల్సినన్ని నిధులు ఇచ్చినా గత ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో సగం కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు వ్యక్తిగత వస్తువులను బయటపడేసిన అధికారులు