Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ ట్యాక్సీ ధరలను పెంచేసిన ఉబెర్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:28 IST)
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర భారీగా పెరిగిపోయింది. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడింది. ముఖ్యంగా భారత్‌పై కూడా చూపించింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ధర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
 
ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్యాబ్ సేవల్లో ప్రముఖ సంస్థగా పేరొందిన ఉబెర్ తన రేట్లను పెంచేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ పెంచిన ధరలు కేవలం ఒక్క ముంబైకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నందున వాటికి అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments