Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఛైర్మన్ ముందుచూపు.. YES BANK నుంచి దేవుడి సొమ్ము రిటర్న్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుచూపుపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యస్ బ్యాంకులో వున్న రూ.600కోట్ల శ్రీవారిని డిపాజిట్లను కొన్ని నెలల క్రితమే వైవీ సుబ్బారెడ్డి ఉపసంహరించుకోవడం ఎంతో మేలు జరిగింది. 
 
యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని ఆర్బీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్‌‍పై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో వినియోగదారులకు పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేసే విషయంలో ఇబ్బందులు తప్పలేదు. 
 
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ హయంలో ఎస్ బ్యాంకుతో సహా 4 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులను టీటీడీ డిపాజిట్లు చేసింది. టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత...డిపాజిట్లపై వైవీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. 
 
ఎస్ బ్యాంకు పరిస్థితులపై ముందే ఆరా తీసిన వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో వెంటనే అందులో ఉన్న డిపాజిట్లను రిటర్న్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 600 కోట్ల టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments