Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొండి బాకీలే కొంపముంచాయి.. యస్ బ్యాంక్ నేపథ్యం ఏమిటి?

మొండి బాకీలే కొంపముంచాయి.. యస్ బ్యాంక్ నేపథ్యం ఏమిటి?
, శుక్రవారం, 6 మార్చి 2020 (12:16 IST)
Yes Bank
యస్ బ్యాంక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మొండి బాకీలే కొంపముంచింది. ఈ బ్యాంకు పరిధిలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్సీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి యస్ బ్యాంకు మొండి బకాయిల విలువ రూ.2299 కోట్ల రూపాయలు. అప్పటి నుంచి ఎలాంటి ఫలితాలను కూడా విడుదల చేయట్లేదు బ్యాంకు యాజమాన్యం. 
 
యస్ బ్యాంకు ఖాతాదారుల ఇబ్బందులు, వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి రిజర్వుబ్యాంకు ప్రత్యేకంగా భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. భారతీయ స్టేట్‌బ్యాంకు, జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) సహా కొన్ని ఇతర ప్రైవేటు బ్యాంకులు.. యస్ బ్యాంకును ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. 
 
రూ.15 వేల కోట్ల మేర పెట్టుబడి మొత్తాన్ని బ్యాంకు మూలధనంగా అందజేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తమ ప్రతినిధిగా ప్రశాంత్ కుమార్ పేరును సూచించినట్లు సమాచారం.
 
కాగా.. చాలాకాలం నుంచీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న యస్ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది. నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తరువాత బ్యాంకు పరిస్థితి, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఆంక్షలను సడలించడమో లేదా.. సవరించడమో చేస్తామని రిజర్వుబ్యాంకు అధికారులు వెల్లడించారు. 
 
అన్ని రకాల బ్యాంకు ఖాతాలు.. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలు, సేవింగ్స్, కరెంట్‌ ఖాతాల లావాదేవీలనూ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. నగదు ఉపసంహరణలు రూ.50వేలు మించడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
 
యస్ బ్యాంక్ నేపథ్యం ఏమిటి?
యస్ బ్యాంక్ అనేక రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. కార్పొరేట్, హోల్ సేల్ బ్యాంకింగ్, రీటైల్ బ్యాంకింగ్, ఇతర బ్యాంకింగ్ ఆపరేషన్లను నిర్వహిస్తూ వచ్చింది. యస్ బ్యాంక్ బ్రాంచ్ నెట్‌వర్క్ 1050 బ్రాంచ్‌ల్లో వుంది. డిసెంబర్ 31నాటికి యస్ బ్యాంక్ ఏటీఎం నెట్‌వర్క్ 1724 వద్ద వుంది. ఇందులో 573 బంచ్ నోట్ అసెప్టర్స్, క్యాష్ రీసైక్లర్స్ వున్నాయి. యస్ బ్యాంక్ ఏటీఎం నెట్ వర్క్ 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి వుంది. 
 
ఈ బ్యాంకును రానా కపూర్ స్థాపించారు. జనవరి 21, 2004 న బ్యాంక్ వ్యాపారం ప్రారంభించినట్లు ఈ బ్యాంక్ ధృవీకరణ పత్రాన్ని పొందింది. 2005 సంవత్సరంలో మాస్టర్ కార్డు ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ గోల్డ్ అండ్ సిల్వర్ డెబిట్ కార్డును ప్రారంభించడంతో రిటైల్ బ్యాంకింగ్‌లోకి ప్రవేశించారు. 
 
జూన్ 2005లో ఆ వ్యాపారం నుంచి బయటికి వచ్చిన యస్ బ్యాంక్.. డిసెంబర్ 2005లో బ్యాంక్ ఎకనామిక్ టైమ్స్ నుండి కార్పొరేట్ డోసియర్ అవార్డును పొందింది. 2006 సంవత్సరంలో యస్ బ్యాంక్ భారతదేశపు ఉత్తమ బ్యాంకులకు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అవార్డులను అందుకుంది. అలాగే బిజినెస్ టుడే-కెపిఎంజి బెస్ట్ బ్యాంక్స్ వార్షిక సర్వే 2008 లో బ్యాంక్ నంబర్ 1 బ్యాంకుగా నిలిచింది.
 
2008-09 సంవత్సరంలో బ్యాంక్ 50 కొత్త శాఖలను, 18 కొత్త ఆఫ్-సైట్ ఏటిఎంలను ప్రారంభించింది. 2009-10 సంవత్సరంలో బ్యాంక్ 33 కొత్త శాఖలను ప్రారంభించింది. 2010-11 సంవత్సరంలో 64 శాఖలను ప్రారంభమైనాయి. మార్చి 31, 2011 నాటికి వారు భారతదేశంలోని 164 నగరాల్లో 214 శాఖలను, దాంతో పాటు 250 ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లను (ఎటిఎంలు) నిర్వహించారు. 
 
2010-11 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బ్యాంక్ వెర్షన్ 2.0తో భారతదేశంలో ప్రపంచంలోని ఉత్తమ నాణ్యత బ్యాంకును నిర్మించడానికి సమాయత్తమైంది. 750 శాఖలను, 3000 ఎటిఎంలు, 12000 మంది ఉద్యోగులు, రూ .125000 సిఆర్ ఏర్పాటు చేయాలనే దృష్టితో కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాకుండా యుఎస్, యూరప్, మిడిల్ ఈస్ట్ ఆసియా, ఆస్ట్రేలియాలోని 8 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 బ్యాంకుల నుండి రుణం విస్తృతంగా పంపిణీ చేయబడింది. ప్రస్తుతం మొండి బకాయిల కారణంగా ఆర్బీఐ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ విశ్వప్రయత్నాలు.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు