Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీ‌స్‌గఢ్ హార్రర్ : మహిళను దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించిన పోలీస్...

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:33 IST)
అత్యాచారాలపై ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం జరిగింది. ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కామాంధుల ముఠాలో ఓ పోలీస్ కూడా ఉండటం గమనార్హం. ఈ కేసులో పోలీస్ దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించాడు. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుల్లో ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయ్‌పూర్‌కు చెందిన ఓ మహిళపై పోలీస్, ప్రభుత్వ అధికారి, ఒక ఉపాధ్యాయుడు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళపై అత్యాచారం చేయడమేకాకుండా ఆ సమయంలో వీడియో తీసి మహిళపై బెదిరింపులు చేశారు. 
 
ఈ విషయం బయటికి చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా బాధితురాలి కూతురిపై కూడా అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో దు:ఖాన్ని గొంతులోనే బిగపట్టుకుని ఉంది బాధితురాలు. 
 
ఆ తర్వాత నుంచి ఆ కామాంధుల ఆగడాలు హెచ్చుమీరిపోయాయి. ప్రతి రోజూ ఆ మహిళను వేధించసాగారు. దీంతో వేధింపులు భరించలేని ఆ బాధితురాలు నాలుగు నెలల తర్వాత పోలీస్ స్టేషన్ గడపతొక్కి, తనకు జరిగిన అన్యాయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన లిఖిత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం