Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న పెట్రో - డీజల్ బాదుడు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (12:45 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాదుడు కొనసాగుతోంది. రోజువారీ ధరల సవరణ సమీక్షను ఈ నెల 22వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. అప్పటి నుంచి 26వ తేదీ వరకు లీటరు పెట్రోల్‌పై రూ.3.70పై పైసలు, డీజల్‌ లీటరుపై రూ.3.75 చొప్పున పెంచేశాయి. తాజాగా, ఆదివారం కూడా ఈ చమురు సంస్థలు లీటరుపై 50 పైసలు, డీజల్‌పై 55 పైసలు చొప్పున పెంచేశాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.37 ఉండగా, డీజల్ ధర రూ.98.69గాఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.115.09గా వుంది. డీజల్‌ ధర రూ.101.22గా ఉంది. 
 
ఇక ఏపీలో లీటరు పెట్రోల్ రూ.113.59గా ఉండగా, డీజల్ ధర రూ.99.54గా వుంది. వ్యాట్‌తో కలుపుకుంటే ఆదివారం రాష్ట్రంలో పెట్రోల్ మీద 95 పైసలు, డీజల్ మీద 90 పైసలు చొప్పున పెంచేశారు. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.113.88గా ఉండగా, డీజల్ ధర రూ.98.13గా ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments