వామ్మో.. బ్యాంకు సేవలు వరుసగా ఐదు రోజులు బంద్

దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలు స్తంభించిపోనున్నాయి. అదీకూడా వరుసగా ఐదు రోజుల పాటు. దీనికి కారణం పండుగ దినాలు రావడంతో రిజర్వు బ్యాంకు సిబ్బంది రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడమే. ఫలితంగా సెప్టెంబరు

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (09:05 IST)
దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలు స్తంభించిపోనున్నాయి. అదీకూడా వరుసగా ఐదు రోజుల పాటు. దీనికి కారణం పండుగ దినాలు రావడంతో రిజర్వు బ్యాంకు సిబ్బంది రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడమే. ఫలితంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వరుసగా బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగనుంది.
 
సెప్టెంబరు ఒకటో తేదీన మొదటి శనివారం పనిదినం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం సెలవు. లేదంటే ఒక పూట మాత్రమే పని చేస్తాయి. 2వ తేదీ ఆదివారం. ఇక 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు. అనంతరం 4, 5 తేదీల్లో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫోరం(యూఎఫ్ఆర్‌బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది. 
 
ఆ రెండు రోజులు ఆర్బీఐ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టనున్నారు. ఫలితంగా ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అయితే, ప్రైవేట్ బ్యాంకు సేవలు మాత్రం యధావిధిగా కొనసాగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments