Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లకు షాకిచ్చిన రిలయన్స్ జియో.. టారిఫ్ ధరలు భారీగా పెంపు!!

వరుణ్
గురువారం, 27 జూన్ 2024 (22:12 IST)
తమ మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో తేరుకోలేని షాకిచ్చింది. టారిఫ్ ధరలను ఒక్కసారిగా భారీగా పెంచేసింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచుతున్నట్టు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.
 
జియో సేఫ్‌ - క్వాంటం సెక్యూర్‌ : ఇది కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీతో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు. జియో ట్రాన్స్‌లేట్‌ - ఏఐ : ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్‌ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది. 
 
దేశంలో 2జీ నెట్‌వర్క్‌కు పరిమితమైన జియో వినియోగదారులు 250 మిలియన్ల మంది ఉన్నారని.. వారు డిజిటల్‌ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారని జియో టెలికాం పేర్కొంది. వీరిని కొత్త తరం డిజిటల్‌ వైపుగా తీసుకొచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్‌, జియో ఫోన్‌లను తీసుకొచ్చినట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments