Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట రైళ్లల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టలేం..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (21:52 IST)
రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో ఛార్జింగ్‌ పాయింట్లను ఇకపై ఉపయోగించలేరని వెల్లడించింది. 
 
అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాత్రి సమయంలో ఛార్జింగ్‌ పాయింట్ల వాడకంపై నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక కోచ్‌లో మొదలైన మంటలు ఏడు బోగీలకు వ్యాపించాయి.
 
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే నిర్ణయించినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 
 
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు అవి వేడెక్కడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇతర రైల్వే జోన్లలో కూడా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments