Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా దినోత్సవం రోజున మొబైల్ కొనే మహిళలకు 10 శాతం రాయితీ : ప్రెస్ రివ్యూ

Advertiesment
మహిళా దినోత్సవం రోజున మొబైల్ కొనే మహిళలకు 10 శాతం రాయితీ : ప్రెస్ రివ్యూ
, శుక్రవారం, 5 మార్చి 2021 (12:38 IST)
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళల కోసం ఏపీ సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించి గురువారం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 
తన క్యాంపు కార్యాలయంలో హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు.. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

 
మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలని, దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2,000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశ యాప్‌ కోసం ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో ఆ రోజు (8వ తేదీ) మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 
మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించనున్నట్లు సాక్షి వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుంకు బాగోతం తెలిసిందనీ భర్తను చంపి పెరట్లోనే పాతిపెట్టిన భార్య!