Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీపీఆర్ "మిసెస్ ఇండియా సీజన్-2" రన్నరప్‌గా ఖమ్మం మహిళ

వీపీఆర్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (07:39 IST)
వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్-2 రన్నరప్‌గా ఖమ్మం మహిళ ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ నెల 21వ తేదీన పీవీఆర్ మిసెస్ ఇండియా సీజన్-2 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఖమ్మ వివాహిత రన్నరప్‌గా నిలిచారు. ఆమె పేరు మహ్మద్ ఫర్హా. 
 
దేశవ్యాప్తంగా 912 మంది వివాహితలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోగా.. 41 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే ఎంపికయ్యారు. ఆమె ఫొటోజెనిక్‌ విభాగంలో మిసెస్‌ ఇండియాగా ఎంపికయ్యారు. 
 
ఇకపోతే, ఎంబీఏ చదివిన ఫర్హా, హ్యూమన్‌ రైట్స్, సోషల్‌ జస్టిస్‌ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం కార్య దర్శిగా సేవలందిస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధిం చానని, మహిళా హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యలమంచిలి రవికి అవకాశం దక్కేనా !?