ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌లో వున్న వడ్డీని దీపావళికి..?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:38 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీని జమ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈ దీపావళి లోగా క్లియర్ చెయ్యాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఆరు కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారందరికీ ఈ నెలాఖరులో గానే వడ్డీ వస్తుందని తెలుస్తోంది. 
 
2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ చాలా కాలంగా క్లియర్ చెయ్యలేదు. అయితే పండుగ సీజన్ కనుక వడ్డీని జమ చెయ్యాలని అనుకుంటోంది. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments