Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన కర్ణాటక పోలింగ్... మళ్లీ మొదలైన పెట్రో బాదుడు.. ఒకేసారి...

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:36 IST)
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును ఒకేసారి బాదేశాయి. కర్ణాటక పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ధరలు పెరగటం మొదలుపెట్టాయి.
 
పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.25, డీజిల్ రూ.71.90పైసలకు చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3 పైసలు అటూ ఇటుగా ఈ ధర ఉంది. ప్రస్తుత ధరల పెంపుదల చూస్తుంటే.. మరో 48 గంటల్లోనే లీటర్ పెట్రోల్ రూ.80 చేరుకున్నా పెద్దగా ఆశ్చరపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments