పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని.. తల్లిదండ్రులు తిట్టలేదనీ సూసైడ్

సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను ప

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:28 IST)
సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను పరీక్షలో ఫెయిలైనా అమ్మానాన్న తిట్టలేదని ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ విషాదకర ఘటన ప్రశాశం జిల్లా జరిగింది. ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తురకపాలెం గ్రామానికి చెందిన గురులక్ష్మి (20) విద్యార్థిని.. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్‌ చదువుతోంది. ఈ క్రమంలో గురులక్ష్మి మొదటి సంవత్సరంలో 9 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు పల్లెత్తు మాటనలేదు. 
 
దీనికి విద్యార్థిని మరింత మనస్తాపం చెందింది. చిన్న సూసైడ్‌ నోట్‌ రాసి.. ఈనెల 11వ తేదీ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ హస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది.
 
పరీక్షలో ఫెయిలైన తమ అమ్మాయిని తిడితే ఏమన్నా చేసుకుంటుందో ఏమోనని.. ఎప్పుడూ తిట్టేవారిమి కాదని.. అయినా తన కూతురు సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sumanth Prabhas: గోదారి గట్టుపైన సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ సాంగ్

Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం దేహ దారుడ్యానికి సిద్ధమవుతున్న మంచు మ‌నోజ్‌

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments