Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల కిరీటం కన్నాకే... ఆ వెంటనే ముద్రగడ భేటీ...

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన కాసేపటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనను కలిశారు. అభినందనలు తెలిపారు.

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:10 IST)
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన కాసేపటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనను కలిశారు. అభినందనలు తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన లక్ష్మీనారాయణను పరామర్శించడానికి వచ్చినట్లు ముద్రగడ తెలిపారు. ఈలోగా ఈ ప్రకటన రావడంతో అభినందనలు తెలిపినట్లు చెప్పారు. కాపు రిజర్వేషన్ల ప్రక్రియ అమలు కోసం బీజేపీ నేతలపైనా ఒత్తిడి తెస్తామన్నారు.
 
కాగా, తన నియామకంపై కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్రాభివృద్ధి బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలు నమ్మేలా చేస్తామని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, విభజన చట్టం హామీల్లో 85 శాతం పూర్తి చేశాం. మిగతా 15 శాతం ఈ ఏడాదిలో నెరవేరుస్తాం. అలాగే, ఇవ్వని హామీలను కూడా ఎన్నో నెరవేర్చామన్నారు. వచ్చే 2019 ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాభివృద్ధికి ఏం చేసిందో ప్రజల కళ్లకు కట్టేలా చూపించి వారి ఎదుట నిలబడి ఓటు అడిగే స్థాయికి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments