బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా నియామకం.. (వీడియో)

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్

Webdunia
సోమవారం, 14 మే 2018 (09:41 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం దీనిపై అధికారికంగా ప్రకటన జారీచేశారు. వెరసి... దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించారు.
 
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు రాజీనామా తర్వాత... అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి. బలమైన నాయకుడి కోసం జల్లెడ పట్టగా... కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పైడికొండల మాణిక్యాలరావు ముందు వరుసలో నిలిచారు. 
 
ఒక్కొక్కొరితో పార్టీకి కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకోవడంతోపాటు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని... సోము వీర్రాజు, కన్నా పేర్లు తుది జాబితాలో నిలిచాయి. చివరికి... అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణను వరించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల కమిటీ కన్వీనర్‌ పదవిని ఏర్పాటు చేసి... దానిని సోము వీర్రాజుకు అప్పగించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments