Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రులు అందుకు రెడీ.. కానీ మోదీ, అమిత్ షా అడ్డుపడుతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్యాకేజీల విషయంలో రోజుకో మాట మాట్లాడటంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంత పోరాడిన

మంత్రులు అందుకు రెడీ.. కానీ మోదీ, అమిత్ షా అడ్డుపడుతున్నారు..?
, గురువారం, 10 మే 2018 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్యాకేజీల విషయంలో రోజుకో మాట మాట్లాడటంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంత పోరాడినా, అవిశ్వాస తీర్మానం చేపట్టినా ఫలితం శూన్యమైంది. దీంతో బీజేపీ రాజకీయ ఎత్తుగడలకు ప్రణాళిక వేసుకుంటోంది. 
 
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని పావుగా చేసుకుని ఏపీలో మద్దతు కూడగట్టుకునేందుకు సై అంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు సై అంటున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు అడ్డుపడుతున్నారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. మోదీ, అమిత్ షా వైఖరితోనే ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలిపారు. 
 
గతంలో పాస్ పోర్టు రావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేదని, ఇప్పుడు మాత్రం రోజుల్లోనే చేతికందుతోందని చెప్పారు. ఎలాగంటే..? కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ మహిళా నేత సుష్మాస్వరాజ్‌ చొరవతోనేనని గల్లా జయదేవ్ కొనియాడారు. 
 
గురువారం గుంటూరులో రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల సౌకర్యార్థం ఓ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాయగానే సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కితాబిచ్చారు. సుష్మా స్వరాజ్ చొరవతోనే ఇంత త్వరగా పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మోహన్ రెడ్డిపై నటుడు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు?