Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (10:20 IST)
పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గులను చవిచూడటం ద్వారా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చి బుధవారం స్థిరంగా కొనసాగిన పెట్రోల్ ధర గురువారం మళ్లీ పైకి కదిలింది.

అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.84.18కు చేరింది. డీజిల్ ధర నిలకడగా రూ.80.17 వద్ద కొనసాగింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. 
 
పెట్రోల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.85.78కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.85.34కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 10 పైసలు పెరుగుదలతో రూ.81.00కు చేరింది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.73.56 వద్ద ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments