జిత్తులమారి కరోనా... చిక్కకుండా రక్షణ కవచాలు : కొత్త కేసుల్లో నయా రికార్డు

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (10:18 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69,652 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 977 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 28,36,926 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 53,866కి పెరిగింది. ఇక 6,86,395 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,96,665 మంది కోలుకున్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ జిత్తులమారిలా తయారైంది. నిరంతరం తన రూపాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఆ కారణంగానే ప్రజల ప్రాణాలు హరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా ఈ కరోనా వైరస్ కూడా మానవ శరీరంలోని డీఎన్ఏనే అని ఏమరపరిచేలా ఓ ఎంజైమును విడుదల చేస్తున్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా, శరీరం విడుదల చేసే యాంటీబాడీలకు చిక్కకుండా వైరస్‌లోని కీలకమైన స్పైక్ ప్రొటీన్‌కు చక్కెరలాంటి అణువులు రక్షణ కవచంలా ఏర్పడుతున్నట్టు జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జయోఫిక్స్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు.
 
కరోనా వైరస్‌పై ఉండే స్పైక్ (కొమ్ము) ప్రొటీన్ మానవ కణాలను గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ స్పైక్‌లపై చక్కెరలాంటి గ్లైకాన్లు అతుక్కుని ఉంటున్నాయని, ఒక్కో కొమ్ముపై మూడేసి అతుకులు ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
స్పైక్ ప్రొటీన్‌లోని తుంటి, మోకాలు, చీల మండలం వంటి భాగాల కారణంగా వైరస్ స్వేచ్ఛగా వంగుతోందని తెలిపారు. శరీరంలోని యాంటీబాడీలు వీటిని గుర్తించే సమయంలో ఈ స్పైక్ ప్రొటీన్‌కు గ్లైకాన్లు రక్షణ కవచంలా అడ్డు నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments