Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (13:45 IST)
శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరిపోతోంది. ఈ కారణంగా ఆ దేశ ప్రజలు అన్నిరకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇపుడు పెట్రోల్, డీజల్ ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. 
 
తాజాగా, పెట్రోలుపై రూ.50, డీజిల్‌పై రూ.60 పెంచారు. ఈ ధ‌ర‌లు ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి అమ‌ల్లోకి రానున్నాయని శ్రీ‌లంక ప్ర‌భుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ (సీపీసీ) తెలిపింది. దీంతో శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.470, డీజిల్ ధ‌ర రూ.460కి పెరిగింది. శ్రీ‌లంక‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం రెండు నెల‌ల్లో ఇది మూడ‌వ‌సారి.
 
చివ‌రిసారిగా మే 24న పెట్రోలుపై 24 శాతం, డీజిల్‌పై 38 శాతం ధ‌ర‌లు పెంచారు. ఇంధ‌నాన్ని తీసుకొచ్చే నౌక‌లు బ్యాంకింగ్‌తో పాటు ఇత‌ర కారణాల వ‌ల్ల ఆల‌స్యంగా వ‌స్తున్నాయ‌ని సీపీసీ తెలిపింది. వ‌చ్చేవారం బంకుల్లో పెట్రోల్‌, డీజిల్ ప‌రిమితంగా ఉంటుంద‌ని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments