Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో పేలుడు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (13:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో శనివారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా బహదూర్ పల్లిలోని ఒక కన్వెన్షన్ హాలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నమహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెను కామారెడ్డికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. ఈమె తన భర్త జయరాజ్‌తో కలిసి బహుదూర్ పల్లిలోని ఎస్‌బీ‌వీ‌కే ఫంక్షన్ హాలులో సెక్యూరిటీ ఉంటూ పని చేస్తున్నారు.
 
శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ డబ్బాను కడిగేందుకు లక్ష్మి ప్రయత్నించగా… ఆ డబ్బా నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆమె శరీరం ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు క్లూస్ టీం తో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డబ్బాలో ఏముంది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments