Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (07:38 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల బాదుడును చమురు కంపెనీలు ఆపడం లేదు. ఫలితంగా వీటి ధరలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకునిపోతున్నాయి. గత 15 రోజుల్లో 13 సార్లు ధరలను పెంచేశాయి. మంగళవారం కూడా మరోమారు రేట్లు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఈ తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.61గా ఉండగా, డీజిల్ ధర రూ.95.87కు చేరుకుంది. అలాగే ముంబైలో లీటరు పెట్రోల్ రూ.119.67గాను, డీజిల్ ధర రూ.103.92గా పలుకుతుండగా, హైదరాబాద్ నగరంలో ఇది రూ.118.59, 104.62గా వుంది. 
 
గత 13 రోజుల్లో మొత్తం 11 రూపాయల మేరకు ధరలను పెంచింది. ఈ పెరుగుదల ప్రతి ఒక్క నిత్యావసర సరకుల ధరలపై ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు కూడా భారీగా పెరగడమే ప్రధాన కారణం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments