హైదరాబాద్‌లోని ర్యాడిసన్ బ్లూ ప్లాజ్ పబ్ లైసెన్సు రద్దు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (07:26 IST)
హైదరాబాద్ నగరంలో ఏళ్ళ తరబడి నడుస్తున్న రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్ లైసెన్సును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలను పట్టుబడ్డారు. 
 
ఇలాంటివారిలో మెగా బ్రదర్ కుమార్తె నిహారిక, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరుల వారసులతో పాటు 150 మందికిపైగా ఉన్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించి నోటీసులిచ్చి పంపించేశారు. పైగా, ఈ కేసును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ హోటల్‌లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ర్యాడిసన్ హోటల్‌ పైఅంతస్తులోనే డ్రగ్స్ లభించిన పబ్ ఉంది. ఈ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో సెలెబ్రిటీల బంధువుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ హోటల్ లైసెన్సుతో పాటు పబ్, బార్ అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఆ హోటల్‌కు ఇచ్చిన పబ్, లిక్కర్ లైసెన్సులను కూడా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments