Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకెళ్తున్న పెట్రోల్ డీజల్ ధరలు.. సెంచరీ ఖాయమా?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (10:00 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత ఈ ధరకు కళ్లెం పడటం లేదు. ఫలితంగా ప్రతిరోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
దీంతో వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95, డీజిల్‌ ధర రూ.75.13కు చేరాయి. గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. 
 
దీంతో జైపూర్‌లో పెట్రోల్‌ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరాయి. జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43గా ఉండగా, డీజిల్‌ ధర రూ.84.46కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.88.37, డీజిల్‌ రూ.81.99గా ఉన్నది. 
 
అలాగే, చెన్నైలో పెట్రోల్‌ రూ.87.64, డీజిల్‌ రూ.80.44, ముంబైలో పెట్రోల్‌ రూ.91.56, డీజిల్‌ రూ.81.87, బెంగుళూరులో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్‌ రూ.79.67, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.86.39, డీజిల్‌ రూ.78.72 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments