Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆగని పెట్రోల్ - డీజిల్ ధరల బాదుడు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (08:38 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడును ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏమాత్రం ఆపడం లేదు. ఏమాత్రం విరామం ఇవ్వకుండా వీటి ధరలను పెంచేస్తున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ ధర బాదుడు వల్ల ప్రజలతో మోయలేని భారం పడుతున్నప్పటికీ చమురు కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
గత నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బాదుడు ఏకధాటిగా కొనసాగుతోంది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్‌పై మరో 40 పైసలు వడ్డించాయి. దీంతో 14 రోజుల వ్యవధిలో ఇంధర ధరల పెరగడం ఇది 12వ సారి. మొత్తం లీటరు పెట్రోల్‌పై రూ.9.44పైసలు, డిజిల్‌పై రూ.9.10 పైసలు చొప్పున వడ్డించాయి. 
 
తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ ధర రూ.95.07కు చేరుకున్నయి. అలాగే, హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డిజిల్ ధర రూ.103.75కి చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments