Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ బంకుల్లో భారీ మోసం : లీటరు కొట్టిస్తే పావులీటర్ ఖతం

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో సిబ్బంది భారీ మోసానికి పాల్పడున్నారు. లీటరు పెట్రోల్ కొట్టిస్తే పావు లీటరు కాజేస్తున్నారు. పెట్రోల్ బంకు యజమానులతో పాటు.. సిబ్బంది కూడా తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో పెట్రోల్ వినియోగదారులు తీవ్రంగా మోసపోతున్నారు. 
 
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. ఒకటి రెండు కాదు దాదాపు 600 బంకుల్లో తనికీలు చేయగా అందులో 17 బంకుల్లో ఇలాగే మోసం చేస్తున్నట్లు తేలింది. వీరు రోజూ రూ.లక్షలలో మోసం చేస్తున్నారు. డిస్‌ప్లే మిషన్‌కు లోపల 2 చిప్‌లు అమర్చి, కరెక్ట్ మీటర్ చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారు. దీంతో విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంకును సీజ్ చేసి… యజమానిపై కేసు నమోదు చేశారు. 
 
ఈ తరహా మోసాలు ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్‌ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments