పెట్రోల్ బంకుల్లో భారీ మోసం : లీటరు కొట్టిస్తే పావులీటర్ ఖతం

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో సిబ్బంది భారీ మోసానికి పాల్పడున్నారు. లీటరు పెట్రోల్ కొట్టిస్తే పావు లీటరు కాజేస్తున్నారు. పెట్రోల్ బంకు యజమానులతో పాటు.. సిబ్బంది కూడా తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో పెట్రోల్ వినియోగదారులు తీవ్రంగా మోసపోతున్నారు. 
 
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. ఒకటి రెండు కాదు దాదాపు 600 బంకుల్లో తనికీలు చేయగా అందులో 17 బంకుల్లో ఇలాగే మోసం చేస్తున్నట్లు తేలింది. వీరు రోజూ రూ.లక్షలలో మోసం చేస్తున్నారు. డిస్‌ప్లే మిషన్‌కు లోపల 2 చిప్‌లు అమర్చి, కరెక్ట్ మీటర్ చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారు. దీంతో విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంకును సీజ్ చేసి… యజమానిపై కేసు నమోదు చేశారు. 
 
ఈ తరహా మోసాలు ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్‌ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments