Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ 2021 : ముఖేష్ అంబానీ టాప్ - ఆదానీ సంపద 49 శాతం పెరుగుదల

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:58 IST)
ఫోర్బ్స్‌‌ 2021 రిచ్‌‌లిస్ట్‌‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ బాస్‌‌ ముకేశ్‌‌ అంబానీ మళ్లీ టాప్‌లో నిలిచారు. 2008 నుంచి ఆయన నెంబర్‌‌ వన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈయన మొత్తం సంపద 92.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ప్రకటించింది. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫోర్బ్స్‌‌ రిచ్‌‌లిస్ట్‌‌లోని టాప్ 100 మంది సంపద 775 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ఇండియా ప్రకటించింది.
 
గత యేడాదితో పోల్చితే 257 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. సుమారు 61 మంది బిలియనీర్లు తమ సంపదకు కనీసం ఒక బిలియన్ డాలర్లను యాడ్‌‌ చేసుకోగలిగారని ఫోర్బ్స్‌‌ పేర్కొంది. రిచ్‌‌లిస్ట్‌‌లోని 80 శాతం మంది సంపద పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలంలో అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది.
 
ఈ రిచ్‌‌లిస్టులో రెండో స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 74.8 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్ రిచ్‌‌ లిస్టులోని ఇతర బిలియనీర్ల కంటే అదానీ సంపద 200 శాతం పెరిగింది. అంటే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 49.5 బిలియన్ డాలర్లు ఎగిసింది. ముఖ్యంగా, ఈయన సంపద భారత్‌లో కరోనా కష్టకాలంలోనే పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments