Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరీ, ఛార్మీ, విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ తో బాల‌య్య భేటీ!

పూరీ, ఛార్మీ, విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ తో బాల‌య్య భేటీ!
విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:46 IST)
ఎవ‌రూ ఊహించ‌ని ఎంట్రీలు ఇవ్వ‌డం న‌ట సింహం బాల‌య్య బాబుకు అల‌వాటు. పైగా ఆయ‌న‌ను పైసా వ‌సూల్ లో ... ఒక రేంజ్ లో చూపించిన పూరీ జ‌గ‌న్నాధ్ అంటే, బాల‌య్య‌కు మ‌హా ఇష్టం. నేను తేడా... తేడా సింగ్ అంటూ, ఊర మాస్ గా త‌న‌ని చూపించిన పూరీ అంటే, అందుకే బాల‌య్య‌కు ఇష్టం. ఆయ‌న కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఎలా ఉంటుందో అనే ఆత్రుత బాల‌య్య‌లో ఉంది. అందుకే పూరీ టీమ్ ని ఆయ‌న త‌ర‌చూ క‌ల‌వాల‌ని కోరుకుంటారు.
 
విజయ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' స్పోర్ట్స్‌ కథగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నటుడు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ 'లైగర్‌' సెట్‌ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్‌తో పాటు విజయ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్ కి వెళ్ళి, చార్మీ, పూరీ, విజ‌య్ ల‌తో బాల‌య్య చాలా జోవియ‌ల్ గా గ‌డిపి వ‌చ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే.. భర్త వీడియో తీశాడు..?