Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 రిలీజ్ - టాప్-10 కుబేరుల్లో అంబానీ

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (12:46 IST)
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన పారిశ్రామివేత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోమారు నిలిచారు. 8100 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నామొన్నటివరకు ఉన్న అదానీ గ్రూపు కంపెనీ అధిపతి గౌతం అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. తాజాగా ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 
 
టాప్-10 జాబితాలో ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పైగా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీ కావడం గమనార్హం. అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా హురున్ పేర్కొన్నారు. నిజానికి గత యేడాదితో పోలిస్తే అంబానీ సంపద 20 అంటే 21 బిలియన్ డాలర్లు తగ్గింది. 
 
మరోవైపు అదానీ సంపద భారీగా క్షీణించింది. దీంతో అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ ఇపుడు భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచారు. కాగా, గతంలో హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అదానీ అస్తులు మంచు గడ్డల్లా కరిగిపోయాయి. ఏకంగా 140 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments