Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ఔషధాల రేట్లు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:07 IST)
ఏప్రిల్‌ 1 నుంచి ఔషధాల రేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగించే వాటితో పాటు మొత్తం 850 రకాల షెడ్యూల్‌ మందుల ధరలు పెరగబోతున్నాయి. 
 
జ్వరం, బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్‌ మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. దీంతో పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌తో సహా పలు అత్యవసర మందుల ధరలు పెరిగిపోనున్నాయి. 
 
జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, రక్తపోటు (బీపీ), చర్మవ్యాధులు, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసెట్‌మాల్‌, అజిత్రోమైసిన్‌, ఫెనోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, సిప్రోఫ్లోక్సాసిన్‌ హైడ్రోక్లోరైడ్‌, మెట్రోనిడాజోల్‌ వంటి మందులు ఈ జాబితాలో ఉన్నాయి.
 
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020తో పోలిస్తే 2021 సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచీ 10.76 శాతం పెరిగినట్లు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments