Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య సిలిండర్ ధరపై బాదుడు.. మార్చి ఒకటో తేదీ నుంచి అమలు!

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (11:08 IST)
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోమారు పెంచాయి. ధరల సవరణ చర్యల్లో భాగంగా, మార్చి ఒకటో తేదీ శుక్రవారం చమురు కంపెనీలు ఈ పెరిగిన ధరలను వెల్లడించాయి. ఈ ప్రకారంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులపై పడుతుంది. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రిటైల్ ధర రూ.1795కు చేరింది. 
 
అలాగే, ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ.1911, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1960.50కు చేరింది. అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపనీలు వెల్లడించాయి. మరోవైపు, విమానం ఇంధన ధరలను కూడా కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో కిలోలీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర రూ.624.37కు చేరిందని చమురు కంపెనీలు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments