Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరగనున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:15 IST)
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీకి కేటాయింపుల్ని మూడింట రెండొంతులు తగ్గించింది. గతంలో పెట్రోలియం సబ్సిడీ రూ.40,915 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రూ.12,995 కోట్లు మాత్రమే కేటాయించింది. ఓవైపు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే కోటి మంది లబ్ధిదారులు ఉన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధిస్తోంది. దీంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెరిగే అవకాశముంది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల్ని తగ్గిస్తోంది. ఒకేసారి కాకుండా దశలవారీగా సబ్సిడీని తగ్గించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కిరోసిన్, వంట గ్యాస్ ధరలు కూడా దశలవారీగా పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.125 పెరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో రెండు సార్లు రూ.50 చొప్పున, ఫిబ్రవరిలో రూ.25 సిలిండర్ ధర పెరిగింది. సామాన్యులకు మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ మరింత భారమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments