Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరిగిన సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి

పెరిగిన సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:50 IST)
సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన చమురురంగ సంస్థలు సవరిస్తాయి. తాజాగా, చమురు రంగ కంపెనీలు 14.2 కిలోల సిలిండర్ పైన రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 మాత్రమే పెరిగింది. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
 
రేట్ల పెంపు నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరుకుంది. ఇదివరకు ఇంతకుముందు రూ.694గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.5కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.777కు చేరింది.
 
తాజా పెంపుతో లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. 
 
గత ఏడాది డిసెంబర్ నెలలో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచగా, ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్‌ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేసేందుకు మరో రూ.30 వరకు తీసుకోవచ్చు. అంటే సిలిండర్‌కు రూ.800కు పైగా తీసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత సమాధి వద్దకు శశికళ? వణుకుతున్న పళని-పన్నీర్, ఎందుకు?