Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్నుల దాఖలు గడువు ముగిసింది.. చివరి రోజున..

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:11 IST)
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. 
 
శనివారం వరకు 5.10 కోట్లకు పైగా దాఖలైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు సమాచారం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడిగించిన గడువు తేదీ 2021 డిసెంబరు 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 
 
అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడిగించనందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి వస్తుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలయ్యాయి. తదుపరి ప్రతి గంటకు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5-6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
 
మరోవైపు, 2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబరు 31 వరకు అపరాధరుసుముతో దాఖలు చేయొచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000, అంతకుమించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి, ఐటీఆర్‌ దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments