Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు తీసుకోవాలంటే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (12:31 IST)
ATM
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను ముట్టుకునేందుకు జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మిషన్‌ను తాకడానికి చాలామంది భయపడిపోతున్నారు. ఎవరెవరో ముట్టుకోవడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉందని చాలామంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. 
 
అయితే ఇక నుంచి ఏటీఎం మిషన్‌ను ఏ మాత్రం చేతితో ముట్టుకోకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో కంటే సులువుగా కూడా పని పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.
 
దీని కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్త రకం మిషన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటిలో ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా కార్డ్ క్లోనింగ్ అవుతుందన్న భయం కూడా ఉండదు. 
 
అత్యంత సురక్షితమైన మార్గం కావడంతో ఈ విధానం తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 25 సెకన్లలోనే డబ్బులు చేతికి వచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇవి కనుక వస్తే రాబోయే రోజుల్లో ఏటీఎంలలో ఇంకా సులువుగా డబ్బులు తీసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments