Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?
, మంగళవారం, 9 జూన్ 2020 (11:00 IST)
ముంబైలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణిస్తే ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడని సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ముంబైలోని కుర్లాలోని హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరా విషయం బయటకు రావడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పప్పు ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కుర్లాలోని న్యూ నూర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగానే అతడు కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం వద్ద డబ్బులు కట్టించుకొని గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇంటికి పంపించారు. 
 
అనుమానంతో వ్యాధి లక్షణాలను పరిశీలించగా అతనికి కరోనా అని తేలింది. దీంతో వైద్యులు సరిగా పరీక్షలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మృతుని కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్.. రికార్డు స్థాయిలో మృతులు.. ఒకే రోజు 331 మంది మృతి