Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రిలో గర్భిణికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో 20మంది సిబ్బంది

ఆస్పత్రిలో గర్భిణికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో 20మంది సిబ్బంది
, మంగళవారం, 9 జూన్ 2020 (11:03 IST)
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గర్భిణికి ఆపరేషన్ చేసిన 20మంది వైద్య సిబ్బందిని హోం క్వారంటైన్ చేశారు. మరోవైపు ఏపీలో కరోనా విలయతాండం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,813కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 2,387 మంది డిశ్చార్జ్ కాగా, 1,381 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
అలాగే చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. చిత్తూరు నగరంలోని చేన్నమ్మ గుడిపల్లెకు చెందిన ఓ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ నెల 3న ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో కుటుంబంలోని 11 మందిని వికృతమాల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి పరీక్షలు జరపగా అందులో ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 
 
మరోవైపు చిత్తూరు సబ్ జైలులో ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహణకు చర్యలు చేపట్టారు. మొత్తం 150 మంది ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలులోని ఖైదీలతో పాటు సిబ్బందికి కరోనా వైద్య పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?