Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 15న పట్టాలెక్కనున్న ఇంజిన్ లేని ట్రైన్ 18

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:28 IST)
భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఇంజన్ రహిత రైలు ఈ నెల పరుగులు పెట్టనుంది. ఫిబ్రవరి 15వ తేదీన దేశంలోనే వేగవంతమైన రైలు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ ఇంజన్ రహిత ట్రైన్‌ని జెండా ఊపి జాతికి అంకితం చేయనున్నారు. 
 
ట్రైన్ 18గా పిలిచే ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసారు. పూర్తి స్వదేశీయతతో రూపొందించిన ఈ ట్రైన్‌ను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేసారు. ఈ రైలును పరీక్షించగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. 
 
ఢిల్లీ, వారణాసి మధ్య ఈ రైలును నడపనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని దీనిని ప్రారంభిస్తారు. స్వదేశంలో తయారైన తొలి రైలు పట్టాలు ఎక్కడం ఎంతో గర్వంగా ఉందని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి మరికొన్ని ట్రైన్‌లను ప్రయాణీకులకు అందించడం కోసం మరింత కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments