ఫిబ్రవరి 15న పట్టాలెక్కనున్న ఇంజిన్ లేని ట్రైన్ 18

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:28 IST)
భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఇంజన్ రహిత రైలు ఈ నెల పరుగులు పెట్టనుంది. ఫిబ్రవరి 15వ తేదీన దేశంలోనే వేగవంతమైన రైలు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ ఇంజన్ రహిత ట్రైన్‌ని జెండా ఊపి జాతికి అంకితం చేయనున్నారు. 
 
ట్రైన్ 18గా పిలిచే ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసారు. పూర్తి స్వదేశీయతతో రూపొందించిన ఈ ట్రైన్‌ను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేసారు. ఈ రైలును పరీక్షించగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. 
 
ఢిల్లీ, వారణాసి మధ్య ఈ రైలును నడపనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని దీనిని ప్రారంభిస్తారు. స్వదేశంలో తయారైన తొలి రైలు పట్టాలు ఎక్కడం ఎంతో గర్వంగా ఉందని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి మరికొన్ని ట్రైన్‌లను ప్రయాణీకులకు అందించడం కోసం మరింత కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments