Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగివచ్చిన అరుణ్ జైట్లీ.. 177 వస్తువులపై పన్ను భారం తగ్గింపు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' విధానంలోభాగంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ విధానంతో నిత్యావసరవస్తు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రంపై తీవ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (16:45 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' విధానంలోభాగంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ విధానంతో నిత్యావసరవస్తు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి.
 
ఈ నేపథ్యంలో విత్తమంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 28 శాతం పన్ను స్లాబ్‌లో 227 వస్తువులు ఉన్నాయి. వీటిలో 177 నిత్యావసర వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి తీసుకొచ్చింది. అంటే ఆయా వస్తువులపై పన్నుభారం 10 శాతం తగ్గింది. అలాగే, 28 శాతం స్లాబ్‌లో కేవలం 50 వస్తువులు మాత్రమే ఉండనున్నాయి. 
 
10 శాతం పన్ను భారం తగ్గిన వస్తు జాబితాలో చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, టూత్ పేస్ట్‌లు, షాంపులు, సెంట్ బాటిల్స్, షేవింగ్ క్రీములు, షేవింగ్ లోషన్స్, వాషింగ్ పౌడర్స్, బట్టల సబ్బులు, మేకప్ ఐటమ్స్, గ్రానైట్ ఇలా 177 నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అలాగే, 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్న నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments