Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది చేయకపోతే మీ పాన్ కార్డ్ మార్చి 31 తర్వాత ఇన్‌వాలిడ్...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (20:41 IST)
ఆధార్ కార్డ్ - పాన్ కార్డ్ లింక్ చేయకపోతే అంతేసంగతులు అనే ప్రచారం ఊపందుకుంది. మార్చి 31 లోపుగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయనట్లయితే పాన్ కార్డ్ రద్దవుతుందని అంటున్నారు. అందువల్ల పాన్ కార్డ్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో దీని గురించి పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది దాదాపు 11.44 లక్షల కార్డులను ఇన్‌యాక్టివ్ మోడ్‌లో వుంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఎవరైతే పాన్‌కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయరో వారి పాన్ కార్డు కూడా ఇలాగే అయిపోవచ్చు. అలా చేస్తే ఇక కార్డు పనిచేయకుండా పోతుంది. ఈ సౌకర్యం ఎందుకంటే... ఆదాయపు పన్ను శాఖ 2019 మార్చి 1 నుంచి ఈ-రిఫండ్స్‌ను నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అంటే... ట్యాక్స్ రిఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుందన్నమాట. పాన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేసుకున్న వారికే ఈ సౌలభ్యం ఉంటుంది.
 
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దీని గురించి చెపుతూ... ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్టులను అనుసంధానం చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. మార్చి నెల 31 లోపుగా ఈ ప్రక్రియను పన్ను చెల్లింపుదారులు పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పులో ఆధార్-పాన్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి అని ఇచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments