Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్

కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
, శుక్రవారం, 15 మార్చి 2019 (09:56 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు వీకే (సీనియర్) నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పదవులకు నరేష్ ప్యానల్ తరపున పోటీచేసిన సభ్యుల్లో ఎక్కువమంది విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. 
 
కాగా మా ఎన్నికల్లో గెలుపొందిన వీకే నరేష్ ప్యానెల్ గురువారం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నరేష్ ప్యానెల్ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణతో కాసేపు ముచ్చటించి ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణం రాజుని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. మాకు ఎంతగానో సహాయ సహకారం అందించి ఇంత ఘన విజయం పొందేందుకు సహకరించినందుకు మా అధ్యక్షుడు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారినిని మర్యాద పూర్వకంగా కలిశారు. అయన అంతే మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని అయన పలు హామీలు ఇచ్చారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనుంటాను, 'మా' అభివృద్ధికి, కళాకారుల బాగోగులు చూసుకునేలా అన్ని విధాలా సహకరిస్తాను అని అయన హామీ ఇచ్చినట్టు నరేష్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో