Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు శుభవార్త... ఏంటది?

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (14:42 IST)
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తక్షణం బెర్తు కేటాయించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయోగాత్మకంగా చేపట్టగా అవి విజయవంతమయ్యాయి. దీంతో మిగిలిన రైళ్ళలో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
సాధారణంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే రెండు, మూడు స్టేషన్‌ల వరకు ఎదురుచూసిన తర్వాత మాత్రమే టీటీఈ ఆ బెర్త్‌ను కేటాయిస్తాడు. ఇకపై అలాంటి అవసరం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 
 
మొదటి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు కన్ఫర్మ్‌ అయిన తన టికెట్‌ను రద్దు చేసుకుంటే, వెంటనే ఆ టికెట్‌ను నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుడికి ఇస్తారు. రద్దయిన టికెట్‌ గురించి వెంటనే టీటీఈకి హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ ద్వారా సమాచారం అందిస్తారు.
 
శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించారు. మొదటి దశలో టీటీఈలకు 500, రెండో దశలో 8 వేల హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ అందజేస్తారు. ఈ విధానాన్ని అని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం