Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు శుభవార్త... ఏంటది?

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (14:42 IST)
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తక్షణం బెర్తు కేటాయించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయోగాత్మకంగా చేపట్టగా అవి విజయవంతమయ్యాయి. దీంతో మిగిలిన రైళ్ళలో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
సాధారణంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే రెండు, మూడు స్టేషన్‌ల వరకు ఎదురుచూసిన తర్వాత మాత్రమే టీటీఈ ఆ బెర్త్‌ను కేటాయిస్తాడు. ఇకపై అలాంటి అవసరం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 
 
మొదటి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు కన్ఫర్మ్‌ అయిన తన టికెట్‌ను రద్దు చేసుకుంటే, వెంటనే ఆ టికెట్‌ను నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుడికి ఇస్తారు. రద్దయిన టికెట్‌ గురించి వెంటనే టీటీఈకి హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ ద్వారా సమాచారం అందిస్తారు.
 
శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించారు. మొదటి దశలో టీటీఈలకు 500, రెండో దశలో 8 వేల హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ అందజేస్తారు. ఈ విధానాన్ని అని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం