Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు - తెలుగు రాష్ట్రాల్లో భారీ వృద్ధి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:12 IST)
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. గత 2022 ఏప్రిల్ నెలతో పోల్చితే, 2023 ఏప్రిల్ నెలలో ఈ పన్నుల వసూళ్లు ఏకంగా 12 శాతం పెరిగాయి. అలాగే గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా ఈ పన్ను వసూళ్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్టు తెలిపింది. గత యేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12 శాతం అంటే రూ.19495 కోట్ల మేరకు పెరిగాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 కోట్లు వసూలు అయ్యాయి. 
 
కాగా, ఈ యేడాది జనవరి నెల నుంచి ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు 10 శాతానికి పైగా పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం గత యేడాది ఇదే నెలతో పోల్చితే ఈ ఏప్రిల్ నెలలో 16 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.4067 కోట్లు వసూళ్లు సాధించగా, ఏపీలో ఈ సారి ఆరు శాతం పెరుగుదలతో రూ.4329 కోట్లు నమోదు చేసింది. అదేవిధంగా తెలంగాణాలో జీఎస్టీ వసూళ్లు రూ.4955 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.5622 కోట్లుగా నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments