స్థిరంగా పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలకు రెక్కలు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:48 IST)
పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీరేట్లు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భౌగోళిక పరిస్థితులు బంగారం ధరల మార్పుకు కారణమవుతోంది. 
 
మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ అతి స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూపాయి చొప్పున బంగారం ధర పెరిగింది. అయితే బంగారం ధరల్లో పెరుగుదల దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. కొన్ని నగరాల్లో ఎక్కువగానే పెరిగింది. 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 46 వేల 910 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 51 వేల 170 గా న‌మోదైంది. మరోవైపు కిలో వెండి ధర 61 వేల 600 రూపాయలుగా ఉంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. హైద‌రాబాద్ న‌గరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 44 వేల 760 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల దర 48 వేల 830 రూపాయలుగా వుంది. వెండి ధర మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.  ఇక్కడ కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments