Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశాన్ని అంటుతోన్న బంగారం ధరలు.. రికార్డ్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:39 IST)
బంగారం ధర పెరిగిపోయింది. కరోనా ఎఫెక్ట్ బంగారంపై కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు బంగారం ధరపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 42,462కు చేరింది. 
 
మంగళవారం నాటితో పోలిస్తే, బుధవారం ఒక్కరోజే ధర రూ. 468 పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలో పెరిగిపోతోంది. కిలో వెండి ధర రూ. 48,652కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో బంగారం ధర రూ. 43 వేలను కూడా దాటేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పడం గమనార్హం.
 
కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు డీలా పడిన తరుణంలో తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ అత్యధిక రాబడులను ఇస్తుందని మదుపరులు అంచనా వేస్తుండటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కావడం ద్వారా కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఫలితంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments