Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఇప్పట్లో రద్దయ్యేలా లేదు... ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర హోంశాఖకు పంపించింది. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లారు. మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా లేదు.
 
దీంతో సీఎం జగన్ ఇతర ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మండలిలో వైసీపీకి మెజార్టీ లేనందున... కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది. 
 
అలాగే, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైవున్నట్టు వినికిడి. మొత్తంమీద తాను అనుకున్న పనిని సాధించేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments