Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ ... 19 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:58 IST)
తమిళనాడు రాష్ట్రంలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు సమీపంలో ఉన్న అవినాసి వద్ద జరిగింది. తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంతో వచ్చిన ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. అంబులెన్స్‌లను రప్పించి, క్షతగాత్రులను తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments